చనిపోవాలనుకున్నా..ఆయనే కాపాడాడుః నటుడు పృధ్వీ

325
prudhvi Raj
- Advertisement -

ఓ మహిళా ఉద్యోగితో నటుడు పృధ్వీ మాట్లాడిన్ కాల్ రికార్డింగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కాల్ రికార్డింగ్ వ్యవహారం వల్ల ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు నటుడు పృద్వీ. ఆ మధ్య ఆడియో టేప్ బయటికి వచ్చిన తర్వాత ఈయన కెరీర్ పూర్తిగా డల్ అయిపోయిందన్నారు. సినిమాల్లో ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఇండస్ట్రీ నుంచి కనీసం తనకు ఇక్కరు కూడా ఫోన్ చేయలేదని బాధపడ్డాడు.

కొద్ది రోజులు ఒంటరిగా గడిపానని..ఒకానొక సమయంలో చచ్చిపోదాం అని డిసైడ్ అయినట్లు తెలిపారు. అలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి తనకు అండగా నిలిచాడని చెప్పాడు. పాపం వాడు ఎలా ఉన్నాడో చూడండ్రా అని కొంత మందికి చెప్పి నా దగ్గరికి పంపించినట్లు చెప్పారు. చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి మరెక్కడా ఉండరని అన్నారు. కాగా ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీపై విరుచుకుపడ్డాడు పృద్వీ. నాగబాబు, పవన్‌కళ్యాణ్ లపై పలు రకాల ఆరోపణలు చేశాడు.

- Advertisement -