- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక ఉద్యమం లా సాగుతోంది. దీనిలో భాగంగా ఎంతో మంది ప్రముఖులు మొక్కలు నాటేందుకు ముందుకువస్తున్నారు.ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని మంచి కార్యక్రమాన్ని చేపట్టారని అందులో భాగంగా మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
నాటిన చెట్టును రక్షించే బాధ్యతను తీసుకోవాలని. నేను ఈరోజు 3 మొక్కలు నాటానని అదేవిధంగా అందరు కూడా మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ పాల్గొన్నారు.
- Advertisement -