పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన డియర్ కామ్రేడ్ మూవీలో బిజీగా ఉన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు నిర్మిస్తున్న ఈమూవీలో రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది. నూతన దర్శకుడు భరత్ కమ్మ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. విజయ్ దేవరకొండ కోసం పలువరు దర్శకులు క్యూలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలకు గ్రీన్ ఇచ్చినట్టు సమాచారం.
దీంతో పాటు ఆయన రెమ్యూనరేష్ కూడా భారీ స్ధాయిలో పెంచినట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇటివలే విజయ్ తో సినిమా చేసేందుకు దిల్ రాజు అతన్ని సంప్రదించాడట. విజయ్ దేవరకొండ రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో… దిల్ రాజు ఆలోచనలో పడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. స్టార్ హీరోలకు ధీటుగా విజయ్ రెమ్యూనరేషన్ పెంచాడని తెలుస్తుంది. 10కోట్లు ఇస్తేనే తనతో సినిమా చేయాలని నిర్మాతలకు గట్టిగా చెబుతున్నాడట విజయ్.