గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రియాంక వర్గీస్ IFS..

462
Priyanka Verghese IFS
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు దూలపల్లిలో మొక్కలు నాటారు ముఖ్యమంత్రి కార్యాలయం OSD (హరిత హారం) ప్రియాంక వర్గీస్ (IFS).

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన తెలంగాణ హరితహారం కార్యక్రమం 23 శాతం నుండి 33 శాతానికి అడవులు పెంచాలన్న లక్ష్యంతో నడుస్తుంది అని.. తెలంగాణ రాష్ట్రం ఈ లక్ష్యాన్ని అతి త్వరలో చేరుకుంటుందన్నారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దీనికి తోడు అవుతుందని.. ఈ చాలెంజ్ వలన ప్రజలలో చైతన్యం కలుగుతుందని తెలిపారు.

మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలి అన్న బాధ్యత పెరుగుతుందని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నీతూ కుమారి ప్రసాద్ IAS కమిషనర్ కమర్షియల్ టాక్స్‌, క్రిస్టియాన IAS కార్యదర్శి గిరిజన సంక్షేమ శాఖ, టెస్సీ థామస్ DRDO బెంగళూరు (missile women of India)లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -