నా కొడుకును ఉరి తీయండిః నిందితుడు చెన్నకేశవులు తల్లి

655
Priyanka
- Advertisement -

వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రియాంకను హత్య చేసిన వివరాలు సైబరాబాద్ సీపీ నిన్న ప్రెస్ మీట్ తెలిపారు. కాగా ప్రియాంక రెడ్డి హత్య కేసు గురించి A4 నిందితుడిగా ఉన్న చింతకుంట చెన్నకేశవులు తల్లి స్పందించింది. తన కొడుకు నేరం చేసినట్లు రుజువు అయితే ఉరి తిసినా మాకు ఎలాంటి భాద లేదన్నారు. నాకు కూడా ఒక కూతురు ఉందని..నేను నవ మాసాలు మోసి ఎలా కన్నానో ఆమె తల్లి కూడా అలానే కనిందని చెప్పింది.

తన కొడుకు ఇలాంటి పని చేశాడని తెలిసి తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని ఆవేదన వ్యక్తం చేశారు. లవ్‌ మ్యారేజీ చేసుకున్నప్పటికీ ఏం అనలేదు. అయ్యిందేదో అయ్యిందనుకున్నాం. వాడికి కిడ్నీ పాడైంది. జక్లేర్‌ వ్యక్తి(మహ్మద్‌ ఆరిఫ్)తో స్నేహం చేసిన తర్వాతే పాడైపోయాడు. లారీ లోడ్‌ చేయాలని వాడే నా కొడుకును తీసుకుపోయిండు. పోలీసులు తెల్లవారుజామున రెండు గంటలకు నా కొడుకును తీసుకుపోయారు. ప్రియాంకను ఎలా చంపారో నా కొడుకును అలా చంపినా ఫర్వాలేదు. ఉరి వేయండి లేదా కాల్చి చంపినా పర్వాలేదని తెలిపింది.

- Advertisement -