రాజ్‌పథ్‌ వద్ద జాతీయ జెండా ఎగురవేసిన రాష్ట్రపతి

363
kovind
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ మెస్సియాస్‌ బొల్సోనారో హాజరయ్యారు. ఈవేడుకకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్షాల నాయకులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ వేడుకలకు త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణే, నేవీ చీఫ్‌ అడ్మైరల్‌ కరంబీర్‌ సింగ్‌, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదురియా హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో రాజ్‌పథ్‌ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -