యాదాద్రిలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు..

54
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గవర్నర్ తమిళి సైతో కలిసి ఇవాళ ఉదయం యాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.

గర్భాలయంలో స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. దర్శనానంతరం రాష్ట్రపతికి ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందిచంగా, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం యాదాద్రి ప్రధాన ఆలయ పరిసరాలను రాష్ట్రపతి పరిశీలించారు. అద్దాల మండపం, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

ఇక అంతకముందు యాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికారు. ఇక యాదాద్రిని దర్శించుకున్న ఐదో రాష్ట్రపతి ముర్ము.

ఇవి కూడా చదవండి..

- Advertisement -