తమిళి సై రాజీనామా అమోదం..

15
- Advertisement -

జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌కు.. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. త‌మిళిసై గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఆ బాధ్య‌త‌ల‌ను రాధాకృష్ణ‌న్‌కు అప్ప‌గించిన‌ట్లు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

అలాగే తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాజీనామాను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోదించారు. పుదుచ్చెరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా కూడా రాధాకృష్ణ‌న్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లను అప్ప‌గించారు.

పూర్తి స్థాయి గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించే వర‌కు తెలంగాణ‌, పుదుచ్చెరి బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించాల‌ని రాధాకృష్ణ‌న్‌ను కోరుతూ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఓ లేఖ రిలీజ్ చేసింది.బాధ్య‌త‌లు స్వీక‌రించిన క్ష‌ణం నుంచి నియామ‌కం అమ‌లు లోకి వ‌స్తుంద‌ని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఆ రిలీజ్‌లో తెలిపింది.

Also Read:రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

- Advertisement -