నేను ధోని అభిమానిని.. చెన్నై గెలుస్తుంది-ప్రితీజింటా

229
Preity zinta Says To I’m Fan Of msdhoni
- Advertisement -

ఐపీఎల్-11 సీజన్ ముగింపు దశకు వచ్చింది. ఈ సీజన్ రెండు జట్లు వరుస విజయాలు నమోదు చేస్తూ.. పాయింట్ల పట్టికలో మొదటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే నాలుగు టీమ్స్ ఈ సీజన్ నుంచి నిష్ర్కమించగా.. మిగతా నాలుగు టీమ్స్ చాంపియన్‎గా నిలిచేందుకు నువ్వా నేనా అన్నట్టు పోటీకి సిద్దంగా ఉన్నాయి. నేడు సన్‎రైజర్ప్ హైదరాబాద్-చెన్నై సూపర్‎కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‎లో ఏ జట్టు గెలిచినా.. నేరుగా ఫైనల్‎లోకి అడుగుపెట్టనుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంది.

Preity zinta Says To I’m Fan Of msdhoni

ఐపీఎల్-11 రేస్ నుంచి నిష్క్రమించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు సహయజమాని ప్రీతిజింటా తన ఫేవరేట్ టీం చెన్నై అంటుంది. నేను ధోనికి పెద్ద అభిమానిని అని, ఖచ్చితంగా చెన్నై టీమ్ ఈ సారి ఐపీఎల్ చాంపియన్‎గా నిలుస్తుందని ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ధోని అంటే ప్రత్యేక అభిమానం అంటూ అభిమానులతో చెప్పుకొచ్చింది. అయితే ఈ సీజన్‎లో క్వాలిఫయర్ మ్యాచ్‎లో చెన్నై చేతిలో ఓడిపోవడం విశేషం.

మొదటి నుంచి వరుస విజయాలతో దూసుకొచ్చిన పంజాబ్, తర్వాత వరుస ఓటములతో ఇంటిముఖం పట్టింది. ఈ లీగ్‎లో 14 మ్యాచ్‎లు ఆడిన పంజాబ్ ఆరు మ్యాచ్ లలో విజయం సాధించి, 8 మ్యాచ్‎లలో ఓటమి పాలైంది. మరోవైపు ఉత్కంఠ భరితంగా సాగనున్న ఈ మ్యాచ్‎లో సన్‎రైజర్స్ మెరవనుందా..? లేక చెన్నై గర్జించనుందా చూడాలి ఇక.

- Advertisement -