ఎన్టీఆర్‌ను ఇబ్బంది పెడుతున్న ప్రశాంత్ నీల్ ?

105
- Advertisement -

కే‌జి‌ఎఫ్ సిరిస్ దేశ వ్యాప్తంగా పేరు సూపర్ క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రశాంత్ తన సినిమాల్లో హీరోలకు ఇచ్చే వీర లెవల్ ఎలివేషన్స్ కు ఇండియన్ సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. దాంతో ఈ డైరెక్టర్ తో మూవీ చేసేందుకు అన్నీ ఇండస్ట్రీలలోని బడా హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ కన్నడ దర్శకుడు మాత్రం తెలుగు హీరోలపైనే ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం నేషనల్ స్టార్ ప్రభాస్ తో ” సలార్ ” మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అటు ప్రభాస్, ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరికీ కూడా నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ ఉండడంతో ” సలార్ ” పై ఆకాశమంత అంచనాలు నెలకొన్నాయి. .

వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 న ఈ మూవీ రిలీజ్ అవ్వబోతున్నట్లు చిత్రా యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. . ఇక ఈ మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు కమిటయ్యాడు ప్రశాంత్. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎన్టీఆర్ మూవీని వచ్చే ఏడాది డిసెంబర్ లో ప్రారంబిచాలని మొదట అనుకున్నారట. అయితే ప్రస్తుతం చేస్తున్న సలార్ మూవీ విషయంలో ప్లాన్ మార్చబోతున్నాడట ప్రశాంత్ నీల్. మొదట సలార్ ను ఒకే భాగంగా తెరకెక్కించాలని భావించినప్పటికి.. ఒకే పార్ట్ లో కథ చెప్పడం వీలు కాదని, అందుకే సలార్ ను కూడా కే‌జి‌ఎఫ్ మాదిరి రెండు భాగాలుగా రూపొందిమే ప్లాన్ లో ఉన్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

ఇదే గనుక నిజం అయితే మరో ఏడాది ” సలార్ ” తో నే గడిపేస్తాడు ఈ కే‌జి‌ఎఫ్ దర్శకుడు.. దాంతో ఎన్టీఆర్ మూవీ కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కోసం ఆతురతగా ఎదురు చూస్తున్న అభిమానులు ఇంకో ఏడాది కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ మూవీ చేయనున్నాడు. ఈ మూవీని త్వరగా కంప్లీట్ చేసి.. ఆ తరువాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం మెకోవర్ అవ్వాలని భావించిన ఎన్టీఆర్ కు సలార్ కారణంగా బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నిజంగానే సలార్ రెండు భాగాలుగా రాబోతుందా అనే దానిపై మాత్రం చిత్రా యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -