- Advertisement -
ఇటీవల సినీ నటి సాయి పల్లవి కశ్మీర్ పండిట్ల హత్యలు, గోహత్యలపై వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకుంది. ఈ వ్యవహారంలో కొందరు సాయిపల్లవిని తీవ్రంగా విమర్శిస్తుండగా, మరికొందరు మద్దతు పలుకుతున్నారు. తాజాగా సాయి పల్లవికి నటుడు ప్రకాశ్ రాజ్ మద్దతు తెలిపారు. మానవత్వమే అన్నింటికంటే ముందు. కాబట్టే సాయి పల్లవి మేము నీతోనే ఉన్నాం అంటూ ఆయన ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు.
కొద్దిరోజుల క్రితం ‘విరాట పర్వం’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ చానెల్కు ఇంటర్వ్యూలో సాయి పల్లవి కశ్మీర్ పడింట్లు, గో హత్యలను ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వివాదం రేగగా… దానిపై సాయి పల్లవి శనివారం వివరణ ఇచ్చారు. ఈ వివరణ చూశాక సాయి పల్లవికి మద్దతు ప్రకటిస్తూ ప్రకాశ్ రాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
- Advertisement -