తెలంగాణపై కుట్రలు తిప్పికొట్టండి: గద్దర్

98
gaddar
- Advertisement -

తెలంగాణపై కుట్రలు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు ప్రజాకవి గద్దర్. ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం మాట్లాడిన గద్దర్…తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసినా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

నీళ్లు, వనరులు, నిధులు సాధించుకుని తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఇటీవల రాజ్యసభలో ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన విమర్శలపై ప్రశ్నించగా మోదీ వ్యాఖ్యలపై చర్చించాల్సిందేనని వెల్లడించారు.

- Advertisement -