ప్రతీ శుక్రవారం ప్రజాదర్బార్..

38
- Advertisement -

ప్రజాభవన్‌లో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇవాళ 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని తెలిపారు సీఎం రేవంత్. అనుకున్నట్లుగానే ప్రజా దర్బార్‌లో తమ సమస్యలను విన్నవించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజా దర్బార్‌కు మంత్రులతో పాటు అధికారులు అంతా హాజరయ్యారు.

ప్రజల నుండి నేరుగా విజ్ఞప్తులను స్వీకరించనున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా రేవంత్ పేరు మార్చిన సంగతి తెలిసిందే.

Also Read:రేణు దేశాయ్ పై బ్యాడ్ హెడ్డింగ్స్

- Advertisement -