ప్రభాస్ ముచ్చట్లు వైరల్

3627
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 2 షోలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ షోలో ప్రభాస్, బాలయ్యతో బోలెడు విషయాలు ముచ్చటించాడు. ఇందులో గ్రేట్ డైరెక్టర్స్ మణిరత్నం, రాజమౌళి పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సంచలన దర్శకుడు రాజమౌళిని మిగతా అందరూ డైరెక్టర్లు తిడతారని ప్రభాస్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే మణిరత్నం గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. నాకు ఒకరి డైరెక్షన్ లో సినిమా చేయాలని ఉంది. డైరెక్టర్స్ లో నాకు మణిరత్నం గారంటే బాగా ఇష్టం. ఎప్పటికైనా తనకు ఆయన డైరెక్షన్ లో సినిమా చేయాలని ఉందని, ప్రభాస్ తన ఆసక్తిని బయట పెట్టాడు. అదేవిధంగా తనకు దిగ్గజ దర్శకుడు విశ్వనాథ్ గారికి మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి కూడా ప్రభాస్ చెప్పాడు.

మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా షూటింగ్ సమయంలో విశ్వనాథ్ గారితో నటించే అవకాశం ప్రభాస్ కి దక్కింది. ఎప్పటిలాగే ప్రభాస్ షూట్ లో పాల్గొన్నాడు. సహజంగా ప్రభాస్ కి సెట్ లో సైలెంట్ గా డైలాగ్ లు చెప్పడం అలవాటు. దీని గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. ‘ నేను ఆ రోజు సైలెంట్ గా డైలాగ్ లు చెప్పడం చూసి విశ్వనాథ్ గారు నన్ను పిలిచి.. ఇలా అయితే ఎలా.. ఓపెన్ గా చెప్పాలి డైలాగ్ లు.. అలా సిగ్గు పడితే ఎలా ?, ఇక నుండైనా డైలాగ్ లు పెద్దగా చెప్పండి అంటూ ఆయన తనకు చెప్పినట్టు ప్రభాస్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ప్రభాస్ బాలయ్యతో చెప్పిన విషయాలు, విశేషాలు ప్రేక్షకులను ప్రస్తుతం బాగా అలరిస్తున్నాయి. ఏ స్థాయిలో అలరిస్తున్నాయి అంటే.. ప్రభాస్ ఎపిసోడ్ దెబ్బకు ఆహా యాప్ కూడా క్రాష్ అయ్యే అయ్యేంతగా. మరి ప్రభాస్ ఎపిసోడ్ కే ఆహా యాప్ క్రాష్ అయితే.. ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ దెబ్బకు.. ఆహా యాప్ ఏమైపోతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

అంచనాలకు మించి ఉంటుంది: చిరంజీవి

మైఖేల్…నువ్వుంటే చాలు సాంగ్‌

మే12న కస్టడీ విడుదల

- Advertisement -