రాధేశ్యామ్‌ యూనిట్‌కి ప్రభాస్‌ అదిరే గిఫ్ట్స్‌!

210
prabhas
- Advertisement -

సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోగా చిత్రయూనిట్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు ప్రభాస్‌.

మొత్తం యూనిట్ సభ్యులందరికి ఖరీదైన రిస్ట్‌ వాచ్‌లను బహుమతిగా ఇచ్చారు ప్రభాస్‌.ప్రస్తుతం ఈ వాచ్‌లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా యూనిట్ సభ్యులు ప్రభాస్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా యు.వి.కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శుక్రవారం ప్రభాస్‌ సలార్‌ షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభం కానుంది.

- Advertisement -