సాహో..టీడీపీ వివాదంపై ప్రభాస్ క్లారిటీ..!

755
prabhas
- Advertisement -

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాహో. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా ఆగస్టు 30న తెలుగు,తమిళం,హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్‌ ఏపీలో జగన్ పనితీరు బాగుందని తెలిపారు. దీంతో ఇక్కడే వివాదం మొదలైంది. ప్రభాస్…వైసీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు సాహోకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌చేయగా వాటికి పుల్ స్టాప్ పెట్టారు నారా లోకేష్.

ఈ నేపథ్యంలో టీడీపీ వివాదంపై స్పందించారు ప్రభాస్. ముంబైలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన కామెంట్స్‌లో కాంట్రవర్సీ ఏం లేదని తెలిపారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని ఆంధ్రప్రదేశ్ బాగుండాలని అన్నానని చెప్పారు. తమ కుటుంబం నుంచి కృష్ణంరాజు రాజకీయాల్లో ఉన్నారని కానీ తనకు మాత్రం ఆ ఫీల్డ్‌వైపు ఇంట్రస్ట్ లేదని చెప్పారు.

- Advertisement -