ఎన్టీఆర్ – ప్రభాస్ అందుకే వెళ్ళలేదు

17
- Advertisement -

హిందువుల దశాబ్దాల కల నేడు నెరవేరింది. ప్రధాని మోదీ నేడు అయోధ్యలో బాలరామున్ని ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజకీయ, సినీ ప్రముఖులు ఆలయం వద్ద సందడి చేశారు. టాలీవుడ్ నుంచి కూడా చాలామంది స్టార్ హీరోలు వెళ్లారు. ఈ క్రమంలోనే బాలరాముని ఆలయం ముందు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి కలిసి సెల్ఫీ కూడా దిగారు. ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన మెగా అభిమానులు.. సెల్ఫీ దిగితే ఈ రేంజ్‌లో ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే, కొందరు స్టార్ హీరోలు మాత్రం అయోధ్యకి వెళ్ళలేదు.

ముఖ్యంగా టాలీవుడ్ నుంచి తారక్‌ మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు. దీనికి కారణం దేవర షూటింగ్‌ అని తెలుస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌తో కీలక సన్నివేశాన్ని చేయాల్సిన కారణంగా తారక్‌ అయోధ్య ట్రిప్‌ రద్దు చేసుకున్నట్టు వార్త చక్కర్లు కొడుతోంది. అన్నట్టు ఎన్టీఆర్ తో పాటు మరో స్టార్ హీరో ప్రభాస్ కూడా వెళ్ళలేదు. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కి ఫుల్ క్రేజ్ ఉంది. అయినా ప్రభాస్ వెళ్లలేదు. దీనికి కారణం తన రెండు సినిమాల షూటింగ్ లో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు అని తెలుస్తోంది.

ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, కల్కి సినిమాలలో నటిస్తున్నారు. నిజానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రభాస్ ఇద్దరూ రాముడి పాత్రలో నటించారు. బాల రామాయణం ద్వారా ఎన్టీఆర్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు కూడా. అలాగే బాలకృష్ణ కూడా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాలేదు. బాలయ్య కూడా రాముడి పాత్రలో నటించారు. మొత్తానికి వీరు హాజరు కాకపోయినా, అయోధ్య‌లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కన్నుల పండుగగా జరిగింది.

Also Read:చంద్రబాబు బ్యాడ్ లక్..నో చెప్పిన పీకే!

- Advertisement -