‘జాన్‌’ కోసం సిద్ధమౌతున్న సాహో..!

463
prabhas
- Advertisement -

`జిల్` చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ తెరకెక్కిస్తోన్న పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ గా షూటింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ నెల 18న నుండి ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో జరగనుంది.

ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ఆ మధ్య ఇటలీలో షూట్ చేశారు. ‘సాహో’ కారణంగా రెండవ షెడ్యూల్ ఆలస్యమైంది. ‘సాహో’ ఫలితం తరువాత ‘జాన్’ కథలో ప్రభాస్ మళ్లీ మార్పులు సూచించడం వలన మరికొంత లేట్ అయిందని అంటారు.

Pooja

ఇక ఈ చిత్రాన్ని కృష్ణంరాజు .. యూవీ క్రియేషన్స్ వారు కలిసి నిర్మిస్తున్నారు. ఈ ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె టీచర్ పాత్రలో కనిపించనుందనే సంగతి తెలిసిందే. 2020 చివ‌ర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

- Advertisement -