రూ. 40 కోట్లతో ప్రభాస్‌ ఏంచేస్తున్నాడు ?

254
- Advertisement -

ప్రభాస్‌….ఇప్పటివరకూ డార్లింగ్‌గా ఉన్న ప్రభా…ఇప్పుడు బిజినెస్‌మాన్‌గా మారబోతున్నాడు. రీల్ లైఫ్ లో కాదు. రియల్‌ లైఫ్‌లోనే. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారి పక్కన ఏడున్నర ఎకరాల స్థలంలో మూడు థియేటర్ల మల్టీ కాంప్లెక్స్, ఆ ఆవరణలోనే రెస్టారెంట్లు, చిన్న పిల్లలకు వివిధ రకాల ఆటల విభాగాలు ఇందులో ఏర్పాటు చేస్తున్నాడు.

 Prabhas is Building UV Multiplex Theatre in nellore

ఈ మూడు థియేటర్లలో ఒక దానిలో దేశంలో మరెక్కడా లేని విధంగా తొలిసారి 106 అడుగుల త్రీడీ ఎఫెక్ట్స్ తో కూడిన భారీ స్క్రీన్ ను ఏర్పాటు చేస్తున్నాడు ప్రభాస్‌. ఇందులో 670 సీట్లు ఉంటాయి. మిగిలిన థియేటర్లలో 170 చొప్పున సీట్లు ఉంటాయి. 2018 తొలి త్రైమాసికంలో వీటిని ప్రారంభించేందుకు ప్రభాస్ సన్నాహకాలు చేసుకుంటున్నాడు.

Prabhas is Building UV Multiplex Theatre in nellore

అంతేకాదండోయ్‌..ఇది పూర్తయ్యాక అక్కడే ఓ భారీ కల్యాణ మండపాన్ని కూడా నిర్మించబోతున్నాడని సమాచారం. ఈ నిర్మాణాన్ని రూ. 40 కోట్లతో నిర్మిస్తున్నాడని టాక్‌. ఇక ఈ వియషం తెలిసిన వారంతా ప్రభాస్ డెషీషన్‌కి ఒక్కసారిగా షాకయ్యారనే చెప్పాలి.

- Advertisement -