వేణు స్వామి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్

456
- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డిసెంబర్ 22న రానున్న చిత్రం సలార్‌. అయితే, ఈ సినిమా గురించి పలు ముచ్చట్లతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి కూడా ప్రభాస్ మీడియాతో పంచుకున్నారు. ‘సలార్ లోని తన పాత్రలో చాలా భావోద్వేగమైనదని ప్రభాస్ అన్నారు. కాగా, తన 21 ఏళ్ల సినీ కెరీర్ లో తాను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌నే అని ప్రభాస్ చెప్పడం విశేషం. ఈ మూవీలో డైరెక్టర్‌కు తాను కొన్ని సూచనలు చేశానన్నారు. ఇక సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా కర్ణాటకలోని బెంగళూరు సిటీలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. దీంతో కేవలం 10 నిమిషాల్లోనే పది వేల టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. వేరే రాష్ట్రంలోనే ఇలా ఉంటే ఇక తెలుగు రాష్ట్రాల టిక్కెట్లు దొరకడం కష్టమే అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోపక్క సలార్‌ మూవీ టికెట్ల రేట్లు భారీగా పెరిగే ఛాన్స్‌ ఉంది. ఇది భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావడంతో.. టికెట్ల రేట్లు పెరగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నైజాం హక్కులను కొనుగోలు చేసిన మైత్రి మేకర్స్‌.. అదనపు టికెట్ రేట్లు, షోల కోసం ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామి పై పడ్డారు. ప్రభాస్‌తో సినిమాలు చేసే నిర్మాతలు వారి జాతకాలు చూయించుకోవాల్సి వస్తుందని సెలెబ్రీటీల జాతకాలు చెప్పె వేణు స్వామి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తాము జాతకాలను చూసుకునే డిసెంబర్ 22న ‘సలార్’ను రిలీజ్ చేస్తున్నామని చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ ఫన్నీగా కామెంట్స్ చేశాడు. మొత్తానికి ప్రభాస్ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రాబోతున్నాయి. దీంతో ‘సలార్’ విషయంలో వేణుస్వామి చెప్పిందే అబద్దం అని ఫ్యాన్స్ నెట్టింట అతన్ని ట్రోల్ చేస్తున్నారు.

Also Read:చలికాలంలో బెల్లం తింటే ఎన్ని లాభాలో!

- Advertisement -