క‌రోనా..ప్ర‌భాస్ రూ.4 కోట్ల భారీ విరాళం

304
prabhas
- Advertisement -

క‌రోనాపై పోరుకు త‌న‌వంతు సాయం అందించారు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. రూ.4 కోట్ల రూపాయ‌ల విరాళాన్ని ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రూ.4 కోట్లలో ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు విరాళంగా ఇస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కి, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల చొప్పున ఇస్తున్నట్టు ప్రకటించారు.

తొలుత‌ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కలిపి కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు ప్ర‌భాస్‌. గురువారం అర్ధరాత్రి సమయంలో మరో ప్రకటన వచ్చింది. ప్రధాన మంత్రి సహాయ నిధికి కూడా రూ.3 కోట్లు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు.

టాలీవుడ్‌లో ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ రూ. 2 కోట్లు, మహేష్ బాబు కోటి రూపాయలు, రామ్ చరణ్ 70 లక్షల రూపాయలు, నితిన్ 10 లక్షల రూపాయలు, దర్శకుడు త్రివిక్రమ్ రూ. 20 లక్షలు, దర్శకుడు అనిల్ రావిపూడి రూ. 10 లక్షలు, దిల్ రాజు రూ.10 లక్షలు , సాయిధ‌ర‌మ్ తేజ్ రూ. 10 ల‌క్ష‌లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

- Advertisement -