ఆర్‌ఆర్‌ఆర్‌ అతిథిగా సాహో…!

258
rajamouli prabhas
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుండగా ఈ నెల 11న ఉదయం 11 గంటలకు లాంఛనంగా ప్రారంభం కానుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు సమాచారం.

ప్రభాస్‌ సినిమా ప్రారంభోత్సవానికి రానున్నడానే వార్తతో సినీ ప్రేక్షకుల్లో ఆనందం నింపుతోంది. ఎందుకంటే ఓ వైపు రాంచరణ్‌,ఎన్టీఆర్ వీరికి తోడు ప్రభాస్‌ను ఒకే వేదికపై చూడటం కొత్త అనుభూతిని కలిగించనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజలు బాక్సర్లుగా కనిపించనున్నారని తెలుస్తోంది. 1920 నేపథ్యంలో చిత్రం తెరకెక్కనుందని టాక్.

 ram charan ntr

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి కథ రాయగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. ఇంతవరకూ తెలుగులో ఎవరూ చేయని ఓ కొత్త కథంశంతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కుతున్నట్లు టాక్‌.

ప్రభాస్‌తో రాజమౌళి కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలు తెరకెక్కించారు. తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టిన మూవీగా ప్రభాస్‌కు మంచి గుర్తింపుతెచ్చాయి. ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్న డార్లింగ్…త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.

- Advertisement -