వైరల్ అవుతున్న ప్రభాస్, రెహ్మాన్ ఫోటో..

372
- Advertisement -

యంగ్‌ రెబర్ స్టార్ ప్రభాస్ మంచి ఫాంలో ఉన్నారు. “సాహో” చిత్రంతో మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు డార్లింగ్. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న”సాహో” చిత్రంలో నటిస్తూనే మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలో మరో మూవీకి సైన్ చేశాడు ప్రభాస్.

తాజాగా “సాహో” సెట్‌లో ప్రభాస్‌ తన 39వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రభాస్‌ బర్త్ డే పార్టీకి లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌ రెహ్మాన్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు.  ఈ క్రమంలో రెహ్మాన్‌తో కలిసి దిగిన ఫోటోను ప్రభాస్ షేర్ చేశాడు. “సాహో” షూటింగ్ జరుగుతుండగా ప్రభాస్‌ను కలిసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు రెహ్మాన్.

ఇక వీరిద్దరూ దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే ఏడాదిలో “సాహో” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన “సాహో” చాప్టర్-1 మేకింగ్ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

- Advertisement -