సాహో దర్శక,నిర్మాతలకు ప్రేమతో…. ప్రభాస్

488
prabhas instagram
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాహో. ఆగస్టు 30న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రభాస్ చేసిన పోస్ట్ అందరి మనసులను గెలుచుకుంది.

ఆగస్టు 30న సాహో విడుదలవుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా తమ సినిమాల విడుదల తేదీలను రీషెడ్యూల్ చేసుకున్న నటులు, నిర్మాతలు, దర్శకులకు ప్రభాస్ కృతజ్ఞతలు చెప్పారు. మీ అందరికీ సాహో టీం రుణపడి ఉంటుంది. మీ సినిమాలన్నీ మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. ప్రేమ, గౌరవంతో ప్రభాస్ పోస్ట్ చేశారు.

ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించారు.

- Advertisement -