- Advertisement -
అమరావతి రాజధానిలో మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 6.8 ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం, మ్యూజియం, ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణం చేపట్టనున్నారు.
పొట్టి శ్రీరాములు వారసుల్ని సన్మానించారు మంత్రి లోకేశ్. తెలుగువారికి గుర్తింపు తెచ్చిన మహనీయులు పొట్టి శ్రీరాములు.. ప్రాణ త్యాగంతో తెలుగు ప్రజలకు దారి చూపారు అన్నారు లోకేశ్.
పొట్టి శ్రీరాములు వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.. పొట్టి శ్రీరాములు త్యాగం నుంచి ఎంతో నేర్చుకోవాలి.. పట్టుదల, అంకితభావం ఆయన నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి..మనమంతా అద్భుతమైన స్మృతివనం నిర్మిద్దాం అన్నారు.
Also Read:గణేశ్ నిమజ్జనం.. ప్రత్యేక బస్సులు
- Advertisement -

