తాను ఆరోగ్యంగానే ఉన్నానని తనపై వస్తున్న వదంతులను నమ్మోద్దని సూచించారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి. విఫలమైపోయిన ఆపరేషన్.. విషమ పరిస్థితిలో పోసాని అంటూ కథనాలు వెలువడ్డాయని, ఇలాంటి వాటితో తన భార్య చాలా బాధపడిందని చెప్పారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన పోసాని యశోద ఆస్పత్రి డాక్టర్ కేఈ రావు వైద్య సేవలతో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారు.
తాను ఇప్పట్లో గ్యారంటీగా చచ్చిపోను. చాలా స్ట్రాంగ్ గా ఉన్నా. కాబట్టి, నాకు వేషాలు ఇవ్వొచ్చు అని తన దైన శైలిలో చెప్పారు పోసాని. ట్రీట్మెంట్ సమయంలో 10 కిలోల బరువు తగ్గి బక్కపలుచగా తయారయ్యా….. తీవ్రమైన జ్వరం వస్తుండటంతో ఒక సమయంలో చచ్చిపోతాననుకున్నా కానీ తనకు పునర్జన్మ ప్రసాదించింది డాక్టర్ కేఈ రావు అన్నారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం చాలా సంతోషకరమన్నారు. అధికారాన్ని చేపట్టిన నాటినుంచే మేనిఫెస్టోలో ఉన్న హామీల అమలు దిశగా అడుగులేయడం గొప్ప విషయమన్నారు. తన సేవల్ని గుర్తించి ఏదైనా పదవి ఇస్తే చేపడుతానని వెల్లడించారు.