డైరెక్టర్‌పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు..

382
- Advertisement -

తెలుగు తెరపై అందాల కథానాయికగా పేరు తెచ్చుకున్న పూనమ్ కౌర్ గత కొద్ది రోజులుగా తన ట్వీట్లతో వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోని ఓ ప్రముఖ దర్శకుడిని టార్గెట్ చేస్తూ పూనమ్….గతంలో చేసిన ట్వీట్లు పెను దుమారం రేపాయి. తన సినిమాలలో హీరోయిన్ గా అవకాశం ఇస్తానని ఓ దర్శకుడు నిరాశ పరిచాడని అవకాశం ఇవ్వకుండా తనను మోసం చేశాడని ఆరోపించింది.

poonam kaur

అంతేకాకుండా…ఓ ప్లాప్ హీరోయిన్ కు ఆ దర్శకుడు తన సినిమాల్లో పదే పదే అవకాశాలు ఇచ్చాడని ఆరోపించింది. ఇతరుల జీవితాలతో ఆ దర్శకుడు ఆటలాడుతుంటాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. తన వ్యక్తిగత జీవితంపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించింది. ఆ దర్శకుడి రహస్యాలకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గరున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా మరోసారి పూనమ్ ఆ దర్శకుడిని ఉద్దేశించి సంచలన ట్వీట్ చేసింది.` `జల్సాలలో ఉంటూ అజ్ఞాతవాసంలో ఏసేస్తాడు జాగ్రత్త…#నమ్మకద్రోహి“ అంటూ పూనమ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

“ఆ నాలుగు కుటుంబాలకు దగ్గరగా ఉండటం .. ఎన్నారై హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడం ఆ దర్శకుడికి అలవాటు. నాకు హిట్లు లేవనే సాకులు చెప్పి ఆ ఎన్నారై హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడు. మరి ఆ ఎన్నారై హీరోయిన్ కు హిట్లు ఉన్నాయా? ఆ ఎన్నారై హీరోయిన్లు మీరు చెప్పిన పనులు బాగా చేస్తారని విన్నాను .. అలాంటి ఉద్యోగాలు చేయకపోవడమే మంచిది” అంటూ ఆమె తన ట్వీట్ లో రాసుకొచ్చింది. పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్స్ కారణంగా ఆ దర్శకుడు ఎవరనే విషయంలో నెటిజన్లకు ఒక క్లారిటీ వచ్చేసింది.

https://twitter.com/poonamkaurlal/status/999688853433679872

- Advertisement -