చెర్రీ, బోయ‌పాటి సినిమా ప్రారంభం

179
Pooja held Ram Charan-Boyapati film
- Advertisement -

ధ్రువ  చిత్రంతో విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ చేస్తున్నాడు.  శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది.  1985 నాటి పరిస్ధితులని తలపించేలా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 Pooja held Ram Charan-Boyapati film
ఈ చిత్రం తరువాత రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు ఇవాళ ఉదయం హైదరాబాద్ లో జరిగాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎల్.ఎల్.పి సంస్థ నిర్మిస్తుంది. మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది అని సమాచారం. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.  రంగస్థలంలో చెర్రీ మాస్ లుక్‌లో కనిపించి అలరించనుండగా ఈ సినిమాలో చెర్రీ లుక్ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

రంగస్ధలం తర్వాత చెర్రీ…కొరటాల శివతో మూవీ చేస్తారని వార్తలు వెలువడ్డాయి. కానీ అనుకోకుండా తెరపైకి బోయపాటి వచ్చారు. ఇక ఈ సినిమాతో పాటు చెర్రీ…మెగాస్టార్ 151 చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్  బ్యానర్‌ పై తెరకెక్కనున్న ఈ చిత్రం…నిర్మాతగా రాంచరణ్‌కు రెండోది. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన చెర్రీ…ఫస్ట్ సినిమాతోనే వందకోట్ల వసూళ్లను రాబట్టారు.

- Advertisement -