బండి సంజయ్‌పై పొన్నం ప్రభాకర్‌ తీవ్ర విమర్శలు..

97
Ponnam Prabhakar
- Advertisement -

బండి సంజయ్ ఒక ఉన్మాది లాగా మాట్లాడుతున్నారని కరీంనగర్‌ మాజీ పార్లమెంట్‌ సభ్యులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్‌ కరీంనగర్‌ ఎంపీగా గెలిచి మూడు సంవత్సరాలు అవుతున్నా.. నియోజకవర్గానికి చేసిందేమి లేదని పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతవిద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవాలని బండి సంజయ్‌ భావిస్తున్నారని, రామరాజ్యం అంటే అందరూ సంతోషంగా ఉండేలా చూడాలని, మసీదులు కూల్చేస్తాం అంటూ రెచ్చగొడుతూ హిందూ ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ధోరణి సరికాదని పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

బండి సంజయ్‌ ఓ జోకర్‌ అయిపోయాడని, ట్రోలింగ్‌లో ఆయనే నెంబర్‌ వన్‌గా ఉన్నాడని పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. మతపరమైన వ్యాఖ్యలు చేసి భావోద్వేగాలు రేగేలా రెచ్చగొట్టిన బడి సంజయ్‌ పైనా చర్యలు తీసుకోవాలని పొన్నం ప్రభాకర్‌ కోరారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పొరపాటున హిందూ గాళ్లు అన్నందుకు బండి సంజయ్‌ గెలిచారని, ఎంపీగా గెలిచి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని బండి సంజయ్‌ దెబ్బతీస్తురన్నారంటూ పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మసీదులు కూల్చాలన్న బండి సంజయ్‌.. మీ పార్టీ అధాకారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాగే చేస్తున్నారా అని పొన్నం ప్రశ్నించారు. గతంలో జనజాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్‌ను అరెస్టు చేసి హంగామా చేసిన ప్రభుత్వం… ఇప్పుడు ఇంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా బండిపై చర్యలు తీసుకోవాలన్నారు, మత సామరస్యాన్ని చెడగొట్టే ఇలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు ఖండించాలని పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

- Advertisement -