పోలీసుల కస్టడీకి ఫౌంహౌస్‌ కేసు నిందితులు..

152
farmhouse
- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఇవాళ ఉదయం నిందితులు నందకుమార్‌, రామచంద్రభారతి, సింహయాజి స్వామీలను తమ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.

వీరిని రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్‌కి తరలించగా ముగ్గురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది. ఈ సందర్భంగా నకిలీ ఆధార్‌, పాన్‌కార్డులు, వంద కోట్లపై ఆరాతీయనున్నారు.

ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసింది. ఆయనతో పాటు నేరాల దర్యాప్తులో అపార అనుభవం, నూతన సాంకేతికతను ఉపయోగించుకోవడంలో నైపుణ్యం ఉన్న ఉన్నతాధికారులను ఈ బృందంలో సభ్యులుగా నియమించింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -