ఈ దేవి మరో స్వాతి..ప్రియుడి సాయంతో భర్త హత్య

247
devi
- Advertisement -

మూడుముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. దంపతుల్లో ఎవరో ఒకరు వేస్తున్న తప్పటడుగులు..పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతోంది. మొన్న స్వాతి, నిన్న జ్యోతి..నేడు దేవి పేర్లు ఏవైనా వారు చేస్తున్న దారుణాలు మాత్రం ఒక్కటే. అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్న భర్తలను హతమారుస్తు చివరికి కటకటాల పాలవుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామం హుకుంపేట గ్రామంలో జరిగిన ఈ ఘటన పెను విషాదాన్ని రేపింది. తాపీ మేస్త్రీగా పనిచేసే వడ్డి ఇమ్మానుయేలకు భార్య దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇమ్మానుయేలు స్నేహితుడైన గండ్రోతు శివకుమార్‌ శివ కూడా తాపీ పని చేస్తుంటాడు. దేవికి తన ఇద్దరు పిల్లలనూ రోజూ పాఠశాలకు తీసుకెళ్లే క్రమంలో శివతో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కాస్తా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలియడంతో రోజు మద్యం తాగివచ్చి దేవితో గొడవపడేవాడు ఇమ్మానుయేలు. దీంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. జూలై 26న రంపచోడవరం సమీపంలోని సీతపల్లిలో గడిబాపనమ్మ ఆలయానికి వెళ్దామని ఇమ్మానుయేలును ఒప్పించాడు శివ. దేవికి కూడా ఫోన్
చేసి రావాలని చెప్పాడు. మార్గం మద్యలో ఇద్దరు మద్యం సేవించారు. ఇమ్మానుయేల్‌కు ఫుల్‌గా మద్యం తాగించారు. తర్వాత దేవితో కలిసి చున్నిని బిగించి హతమార్చారు. అనంతరం పెట్రోలు పోసి నిప్పంటించారు.

తర్వాత దేవి తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.

- Advertisement -