యాంకర్ శ్రీముఖిపై కేసు నమోదు..!

356
Sreemukhi
- Advertisement -

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ప్రముఖ తెలుగు యాంకర్ శ్రీముఖి. అన్ని ప్రముఖ ఛానెల్స్‌లో కూడా ఈమె కార్యక్రమాలు చేస్తుంది. అందులో కొన్ని రియాలిటీ షోస్ కూడా ఉన్నాయి. ఇక తాజాగా శ్రీముఖిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హైదరాబాద్, నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి శ్రీముఖిపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసినట్టు సమాచారం.

Sreemukhi

ఇక అసలు విషయంలోకి వెళ్లితే… ఓ ప్రముఖ టెలివిజన్‌ చానల్‌‌లో శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించిన ఓ షోలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా.. వాళ్లను కించ పరిచేలా శ్రీముఖి వ్యాఖ్యలు చేసిందని ఆరోపిస్తూ శర్మ బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించాడు. అంతేకాదు శ్రీముఖితో పాటు సదరు టీవీ ఛానెల్ యాజమాన్యంపైనా శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వాళ్లు వాళ్లపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -