రాజాసింగ్‌కు షాక్..కేసు నమోదు

72
raja singh
- Advertisement -

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గట్టి షాక్ తగిలింది. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పలు స్టేషన్లపై ఆయనపై ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్ పరిధిలోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

కేంద్రం ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ రాజా సింగ్‌కు ఇటీవల ఈసీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోగా సమాధానమివ్వాలని రాజాసింగ్‌ను స్పష్టం చేసింది. అయినా గడువులోగా రాజాసింగ్‌ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయనపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది ఈసీ. దీంతో పోలీసులు కేసు నమోదుచేశారు.

రాజాసింగ్ ప్రెస్‌మీట్లు, ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణపై సైతం నిషేధం విధించింది ఈసీ.

- Advertisement -