- Advertisement -
ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కేసు నమోదైంది. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఢిల్లీ స్పెషల్ సెల్లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అలాగే ఆలయ పూజారి యతి నర్సింగానంద్పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు.
దీనిపై తనదైన శైలీలో స్పందించారు ఓవైసీ. బీజేపీని వ్యతిరేకించే వారిపై కేసులు పెట్టడం ద్వారా బీజేపీ మద్దతుదారులను పోలీసులు సంతోషపెడుతున్నారంటూ విమర్శించారు. ఢిల్లీ పోలీసులు బ్యాలెన్స్ వాడ్ సిండ్రోమ్తో బాధపడుతున్నారని…ఈ కేసులకు తాను భయపడేది లేదన్నారు.
- Advertisement -