బన్నీ నిర్మాతలపై కేసు నమోదు..!

531
bunny
- Advertisement -

హీరో అల్లు అర్జున్ నటించిన ‘అల…వైకుంఠపురములో’ సినిమా మ్యూజికల్ నైట్ వేడుకను ఏర్పాటు చేసిన నిర్వాహకులపై కేసులు నమోదు అయ్యాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా మ్యూజిక్ కాన్సర్ట్ ను శ్రేయాస్ మీడియా, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్వహించాయి. అయితే, అనుమతి తీసుకున్న సమయాని కన్నా అదనంగా మరికొంత సేపు కార్యక్రమాన్ని నిర్వహించారని, ఈ విషయంలో పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదైంది.

allu arjun

దాదాపు 5 నుంచి 6 వేల మంది వరకూ అభిమానులు వస్తారని, రాత్రి 10 గంటల్లోపు కార్యక్రమం ముగుస్తుందని చెప్పారని.. కానీ రాత్రి 11.30 గంటల వరకూ కార్యక్రమం నిర్వహించని ఆయన అన్నారు. అయితే, దాదాపు 15 వేల మందిని నిర్మాణ సంస్థ ఆహ్వానించిందని, ఆరు వేల మంది దాటరని చెప్పి, మరింత మందిని తరలించడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అభియోగాలు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు జరుగుతోంది.

- Advertisement -