- Advertisement -
ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్పై కేసు నమోదు అయింది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్ రాజు తదితరులపై ఆరోపణలు చేశారు అన్వేష్.
హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా ప్రచారం చేశాడని సుమోటాగా కేసు నమోదు చేశారు పోలీసులు.
కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసే వారిని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తూ వస్తున్నారు అన్వేష్. ఆధారాలను బయటపెడుతూ సెలబ్రెటీల బండారాన్ని బయటపెడుతున్నారు.
Also Read:విజయ్..హిట్ కొట్టేనా?
- Advertisement -

