నకిలీ కరోనా సర్టిఫికెట్లు చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్..

70
- Advertisement -

హైదరాబాద్‌లో నకిలీ ఆర్‌టీపీసీఆర్‌, కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ మేరకు పూరాని హవేలీ సిపి కార్యాలయంలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ చక్రవర్తి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. డీసీపీ మాట్లాడుతూ.. రెండు వేరు వేరు ముఠాలను వలపన్ని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసాము. ఇందులో మొత్తం నలుగురునీ రిమాండ్ తరలిస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వ , ప్రయివేటు కార్యాలయాల్లో సెలవులు కోసం ఆర్టీపీసీఆర్ రిపోర్ట్స్ లను తయారు చేసి ఉద్యోగులకు ఈ ముఠా సర్టిఫికెట్లు ఇస్తోం.. దేశీయ, అంతర్జాతీయ విమానా ప్రయాణాల కోసం ఆర్‌టీపీసీఆర్‌ రిపోర్ట్స్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను ఈ ముఠా తయారు చేస్తుంది. ఈరెండు ముఠాల్లోని లక్ష్మణ్ నుండి ఫేక్ RT-PCR కోవిడ్ 19 రిపోర్ట్స్ (నెగటివ్ రిపోర్ట్స్) 65,Sample కలెక్షన్ కిట్స్-20,ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాం.. తరిఖ్ హాబీబ్ నుండి ఫేక్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్-50, ఫేక్ RT-PCR కోవిడ్ 19 రిపోర్ట్స్ (నెగటివ్ రిపోర్ట్స్) 10, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వెల్లడించారు.

- Advertisement -