వైసీపీ నిర్లక్ష్యం వల్లే పోలవరం ఆలస్యం!

6
- Advertisement -

వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం ఆలస్యమైందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ఏడు మండలాలు ఏపీకి వచ్చాయి కాబట్టి పోలవరం మొదలుపెట్టామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలు ఎదుర్కొందని….వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారని తెలిపారు.

గత ప్రభుత్వ తీరు పోలవరానికి శాపంగా మారిందని… గత పాలకులు తన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని చెప్పారు. అన్నీ సవ్యంగా జరిగితే పోలవరం ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తవుతుందని అన్నారు. ఏజెన్సీతో పాటు సిబ్బందిని కూడా మార్చారన్నారు. రాయలసీమకు కూడా గోదావారి నీరు తీసుకువెళ్లే పరిస్థితి వస్తుందని తెలిపారు. రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి శాపంగా మారారని అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారని చంద్రబాబు నాయుడు చెప్పారు.

Also Read:ఏకాగ్రతను పెంచే ‘తులాసనం’!

- Advertisement -