బాన్సువాడలో 5వేల డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లనిర్మాణం: పోచారం

270
pocharam srinivas reddy
- Advertisement -

కామారెడ్డి జిల్లాలో రూ. 2.51 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నసరుల్లాబాద్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇళ్ళను ప్రారంభించి, లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు మరియు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు..ఈసందర్భంగా జరిగిన గ్రామ సభలో స్పీకర్ మాట్లాడుతూ…కులం, మతం, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ పరిధిలోని గూడు లేని పేద వారందరికీ స్వంత ఇంటిని నిర్మించి ఇస్తాం అన్నారు.

పేదవారికి స్వంత ఇల్లు దేవాలయం.ఇరుకు గదుల ఇళ్ళలో పేదలు తమ ఆత్మాభిమానం చంపుకుని నివసిస్తున్నారు.పేదింటి ఆడబిడ్డ ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్ బెడ్ రూం ఇళ్ళు.గత ప్రభుత్వాల హయాంలో ఇళ్ళ సబ్సిడీలో సగం మాత్రమే మాఫీ ఉండేది.కాని నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో, అన్ని వసతులతో రెండు పడక గదుల ఇళ్ళను నిర్మిస్తుందన్నారు.

ముఖ్యమంత్రి దయతో బాన్సువాడ నియోజకవర్గంలో అయిదు వేల ఇళ్ళను నిర్మిస్తున్నాం.నియోజకవర్గ పరిదిలోని 110 గ్రామాలలో అయిదు వేల ఇళ్ల నిర్మాణం జరుగుతుంది.ఇళ్ళు తీసుకున్న వారు తమ ఇంటితో పాటుగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ మోస్తది అనే వారికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిదర్శనం.రైతులు అప్పుల పాలవ్వకుండా బాధల నుండి బయటకు రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.

రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయల సహాయం, రైతు బీమా ద్వారా ప్రతి రైతుకు రూ. 5 లక్షల భీమా సౌకర్యం, అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం, పండిన ప్రతి గింజను మద్దతు ధరతో ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందన్నారు.గ్రామాలలో 90 శాతం రైతులు ఉంటారు. రైతులు ఆనందంగా, సుఖంగా ఉంటే దేశం బాగుంటుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు ఓ భగీరధ ప్రయత్నం.జులై ఆఖరి నాటికి కొండపోచమ్మ సాగర్ ద్వారా, వచ్చే ఏడాది నాటికి మల్లన్న సాగర్ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి నీళ్లు వస్తాయి.రూ. 17 కోట్లతో 100 పడకల సామర్థ్యంతో బాన్సువాడ పట్టణంలో మాతా శిశు ఆసుపత్రిని నిర్మిస్తున్నాం.బొమ్మన్ దేవ్ పల్లి చౌరస్తా నుండి గ్రామంలోకి రూ.2.25 కోట్లతో నూతనంగా మరింత సామర్థ్యంతో బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి.‌ త్వరలోనే పనులు ప్రారంభిస్తాం అన్నారు.

- Advertisement -