గ్రీన్ ఛాలెంజ్‌లో పోచారం భాస్కర్ రెడ్డి

47
- Advertisement -

తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో మొక్కలను నాటారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి.

ఈసందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణ కోసం MP సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో ఆలోచన అన్నారు.

Also Read:బాదం, వేరుశనగ తింటే ఎన్ని లాభాలో..!

చెట్లు ఉంటేనే పర్యావరణం బాగుంటుంది, సకాలంలో వర్షాలు కురుస్తాయి. కాలుష్యం లేకుండా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్ల చెట్లను నాటారు.ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా మొక్కలను నాటాలని తెలిపారు. అదేవిధంగా నాటిన చెట్లను సంరక్షించాలని సూచించారు.

Also Read:Janasena:పవన్ ప్రశ్నల వర్షం అగదా?

- Advertisement -