దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతోంది. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ గడువు ఈ నెల 17తో ముగుస్తున్న నేపథ్యంలో సోమవారం (నిన్న) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశంలో పాల్గొని చర్చించిన విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో ఈ నెల 17 అనంతరం లాక్డౌన్ను పొడిగించాలా? లేక నిబంధనలు సడలించాలా? అన్న అంశాలపై ఆయన ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు.ఈ నేపథ్యంలో తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు మోదీ సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ నేడు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
లాక్డౌన్ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ప్రధాని మాట్లాడుతారు.దేశవ్యాప్త లాక్డౌన్ నేటితో 49వ రోజుకు చేరుకుంది. దేశంలో 70,756 మంది కరోనా వైరస్ భారిన పడ్డారు.కోవిడ్-19 కారణంగా దేశంలో ఇప్పటి వరకు 2,293 మంది మరణించారు.