ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉజ్బెకిస్థాన్లోని తస్కెంట్కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు మిర్జియోయేవ్తో ఆయన ప్రతినిధి బృందాల స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య మరియు ప్రజల మధ్య సంబంధాల రంగాలలో సహకారాన్ని సమీక్షించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేస్తారు.
ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో జరగనున్న SCO సదస్సులో ప్రధాని మోదీ భద్రత, కనెక్టివిటీ మరియు అవకాశాల వంటి భారతదేశ ప్రాధాన్యతలను తెలియజేస్తారు. అలాగే ఈ సదస్సు సందర్భంగా SCO నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు.మధ్య ఆసియా సంపన్న సాంస్కృతిక వారసత్వ వేడుకల్లో భాగంగా కిర్గిజిస్థాన్లో జరగనున్న 6వ వర్ల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీ ఆగస్టు 29-30 తేదీల్లో ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్థాన్లో, ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు 26వ SCO సదస్సు కోసం కిర్గిజిస్థాన్లో పర్యటిస్తారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ తష్కెంట్లో అధికారిక పర్యటన చేపట్టారు. ఉజ్బెకిస్థాన్లో ప్రధానికి ఇది నాల్గవ పర్యటన కానుంది. ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచేందుకు అధ్యక్షుడు మిర్జియోయేవ్తో ప్రధాని మోదీ ప్రతినిధి బృందాల స్థాయి చర్చలు జరుపుతారు. ఈ సమయంలో ఇరు నాయకులు వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య మరియు ప్రజల మధ్య సంబంధాల రంగాలలో సహకారాన్ని సమీక్షించి, భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తారని ప్రకటన పేర్కొంది.
అంతేకాకుండా, ‘వికసిత్ భారత్ 2047’ మరియు ‘ఉజ్బెకిస్థాన్-2030’ భాగస్వామ్య అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంపై వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. తష్కెంట్లోని శాస్త్రి మెమోరియల్ మరియు తష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మా గాంధీ సెంటర్ను కూడా ప్రధాని మోదీ సందర్శించనున్నారు.తష్కెంట్ నుండి ఆయన కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 26వ SCO సదస్సులో పాల్గొనడానికి బిష్కెక్కు వెళతారు. 2017 నుండి భారతదేశం పూర్తిస్థాయి సభ్య దేశంగా ఉన్న షాంఘై సహకార సంస్థ (SCO) 25వ వార్షికోత్సవాన్ని ఈ సదస్సు పురస్కరించుకోనుంది.
Also Read:క్రిస్మస్ కానుకగా ‘కింగ్ 100’
ప్రధాని మోదీ ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ భద్రత, కనెక్టివిటీ మరియు అవకాశాల విషయంలో భారతదేశ ప్రాధాన్యతలను స్పష్టం చేస్తారని ప్రకటన తెలిపింది. సదస్సు వేదికగా SCO నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తారు. అలాగే కిర్గిజిస్థాన్లో మధ్య ఆసియా సంపన్న సాంస్కృతిక వారసత్వ వేడుకగా జరిగే 6వ వర్ల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా ప్రధాని మోదీ పాల్గొంటారు.

