9 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియోకాన్ఫరెన్స్…

169
modi
- Advertisement -

నేడు 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు ప్రధాని నరేంద్రమోడీ.కరోనా పరిస్థితి, సంబంధిత అంశాలపై సీఎం లతో చర్చించనున్నారు.

ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ ఈ సమావేషంలో మాట్లాడనున్నారు.

ఈ సమావేశంలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, డా. హర్షవర్థన్, కిషన్ రెడ్డి, కేబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీ లు పాల్గొంటారు. ఇక వీడియో సమావేశంలో మోడీ కరోనా ను జయించడానికి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.వరద సహాయక చర్యలపై సోమవారం ప్రధాని మోడీ ఆరు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

- Advertisement -