- Advertisement -
పీఎం కిసాన్ 20వ విడత నిధులు విడుదలయ్యాయి. యూపీలోని వారణాసిలో జరిగిన బహిరంగ సభలో అర్హత కలిగిన ప్రతి రైతుకు పీఎం మోదీ కిసాన్ 20వ విడత రూ.2వేలు విడుదల చేశారు. మొత్తం రూ. 20వేల కోట్లకు పైగా నిధులను రిలీజ్ చేశారు.
పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు eKYC తప్పనిసరి. మీరు e-KYC ప్రక్రియను 3 మార్గాల్లో పూర్తి చేయవచ్చు. ఓటీపీ ఆధారిత ఇ-కేవైసీ, బయోమెట్రిక్ ఇ-కేవైసీ, ఫేస్ అథెంటికేషన్ ద్వారా పూర్తి చేయొచ్చు.
అధికారిక వెబ్సైట్ (https://pmkisan.gov.in) విజిట్ చేయండి.
‘Know Your Status’పై క్లిక్ చేయండి
మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ను ఎంటర్ చేయండి.
మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేయండి.
మీ eKYC పూర్తయి ఉండాలి.
Also Read:RSP:బ్యూరోకాట్సా..అధికార పార్టీ ప్రతినిధులా?
- Advertisement -

