- Advertisement -
నిరుద్యోగ సోదరులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడండి అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు ఆయన వనపర్తి జిల్లాలో పర్యటించి.. భారీ బహిరంగ సభలో మాట్లాడారు.. ఇందులో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నానని, నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీ చూడాలని వెల్లడించారు.
ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారం అయిందో రేపు అసెంబ్లీలో చెప్పబోతున్నానని అన్నారు. తెలంగాణ కోసం ఎలా ఉద్యమం చేపట్టి కొట్లాడామో, దేశం కోసం కూడా అలాగే పోరాడదామని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని ఉద్ఘాటించారు. అణువణువున తెలంగాణ జీర్ణించుకున్న రక్తంలో తెలంగాణ కోసం చివరి ఊపిరి దాకా.. చివరి బొట్టు దాకా తెలంగాణ ప్రగతి కోసమే తప్ప టీఆర్ఎస్ వేరే పని చేయదని సీఎం కేసీఆర్ తెలిపారు.
- Advertisement -