నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం

211
- Advertisement -

నేపాల్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఖాట్మాండులోని త్రిబువన్‌ ఎయిర్‌ పోర్టులో బంగ్లాదేశ్‌కు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యూఎస్-బంగ్లా ఎయిర్‌వేస్‌కు చెందిన విమాన బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

BRK-PLANE

 విమానంలో 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.ఒక్కసారిగా విమానం కుప్పకూలడంతో దట్టమైన పోగలు అలుముకున్నాయి. ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

 Plane crash at Nepal's Kathmandu airpor

- Advertisement -