ఆగని పెట్రో మంట..

48
- Advertisement -

పెట్రో మంట ఆగడం లేదు. వరుసగా నాలుగోరోజు పెట్రోల్ ధరలు భగ్గుమన్నాయి. లీట‌ర్ పెట్రోల్‌పై 89 పైస‌లు, డీజిల్‌పై 86 పైస‌లు పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 111.80కి చేరగా డీజిల్ ధ‌ర రూ. 98.10గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 98.61 కాగా, డీజిల్ ధ‌ర రూ. 89.87గా ఉండగా ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ. 113.35 కాగా, డీజిల్ ధ‌ర రూ. 97.55గా ఉంది. పెట్రోల్ ధరల పెంపుపై సామాన్యులు భగ్గుమంటున్నారు.

- Advertisement -