మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు…

149
petrol
- Advertisement -

పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా నాలుగో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెరుగగా రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.113.36, డీజిల్‌ ధర రూ.106.60కు చేరింది.

ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.108.99కి చేరగా, డీజిల్‌ రూ.97.72కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్‌ రూ.114.81, డీజిల్‌ రూ.105.86, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.109.46, డీజిల్‌ రూ.100.84, చెన్నైలో పెట్రోల్‌ రూ.105.74, డీజిల్‌ రూ.101.92కి చేరాయి.

- Advertisement -