షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

154
petrol
- Advertisement -

సామాన్యులకు మళ్లీ షాక్ తగిలింది. లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 15 పైసల వరకు పెంచగా హైదరాబాద్‌లో సెంచరీ దాటి పరుగులు పెడుతోంది చమురు ధరలు. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్‌రూ.107.79, లీటర్‌ డీజిల్‌రూ.100.51కు చేరగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో లీటర్‌ పెట్రోల్‌ రూ.100 మార్క్‌ను దాటింది.

ఢిల్లీలో పెట్రోల్‌ రూ.96.66, డీజిల్ రూ.87.41గా ఉండగా ముంబై పెట్రోల్‌ రూ.102.82, డీజిల్‌ రూ.94.84గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.100.46, డీజిల్‌ రూ.95.28గా ఉండగా కోల్‌కతాలో రూ.96.58, డీజిల్‌ రూ.90.25గా ఉంది.

మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇంధన ధరలు 26వసార్లు పెరుగగా ఇప్పటి వరకు చమురు కంపెనీలు రూ.6.34, డీజిల్‌పై రూ.6.63 వరకు పెంచాయి.

- Advertisement -