టీఆర్ఎస్ కే మా ఓటు

254
TRS
- Advertisement -

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీ అభ్యర్థులు ప్రచారం పర్వం జోరు సాగిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో తాము టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకే ఓటు వేస్తామంటూ పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఏకగ్రీవ తీర్మానాలు చేసిన సంగతి తెలిసిందే. తాము సీఎం కేసీఆర్‌ సార్‌కే అండగా ఉంటామని, టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులనే తాము గెలిపిస్తామంటూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు. అంతే కాకుండా టీఆర్‌ఎస్‌ పార్టీల అభ్యర్థుల నామినేషన్‌ ఖర్చులకు కూడా ప్రజలు అభిమానంతో డబ్బులు ఇస్తున్నారు.

rasamai balakishan

ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్‌ రావుకు సిద్ధిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్‌ ప్రజలు అభిమానంతో నామినేషన్‌ ఖర్చులకు డబ్బులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి రసమయి బాలకిషన్‌కు స్వచ్ఛందంగా మద్దతిస్తున్నారు. రసమయికే తమ ఓటు అంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. రసమయి వెంట ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. మహిళలు కోలాటాలు, బతుకమ్మలతో అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. అంతేకాకుండా రసమయి నామినేషన్‌ ఖర్చులకు పలు గ్రామాల ప్రజలు డబ్బులిచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. రసమయి బాలకిషన్‌ను ఈ సారి భారీ మెజార్టీతో గెలిపిస్తామంటూ ప్రతీన బూనుతున్నారు.

trs elections

అటు మంత్రి లక్ష్మారెడ్డికి సైతం జడ్చర్లలో అపూర్వ స్వాగతం లభిస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లక్ష్మారెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. అంతే కాకుండా లక్ష్మారెడ్డికి డబ్బులిచ్చి తమ ఓటు నీకే అంటూ సంతోషంతో చెబుతున్నారు. పైన ఫోటోలో చూస్తే ఒక వృద్ధుడు అభిమానంతో లక్ష్మారెడ్డికి డబ్బులు ఇచ్చి నా ఓటు నీకే వేస్తానంటూ చెబుతున్న దృశ్యం మనకు స్పస్టంగా కనిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు పుల్‌ జోష్‌తో ప్రచారంలో పాల్గొంటున్నారు. వారికి అదే రీతిలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.

 

- Advertisement -